Friday, November 21, 2014

హైదరాబాదు శ్రీయుత కె. చంద్రశేఖరరావు గారు, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాదు.

తేది : 05.06.2014

                  విషయం : నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై పనిచేస్తున్న ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌లోని నర్సారావుపేట డివిజన్‌కు మార్చిన దానిని రద్దు చేయుట గురించి....
                  ప్రోసీడిరగ్స్‌ నం. ఎ`ఐ/ఇఇ/డిఎండి/ఎపిఆర్‌`ఆక్ట్‌/2014/ఎస్‌82 తేది : 01.06.2014

అయ్యా !

    పై ప్రొసీడిరగ్స్‌ ప్రకారం నాగార్జునసాగర్‌ మేజర్‌ ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్రంలోని ఎడమ కాలువపై పని చేస్తున్న సిబ్బందిని మరియు ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట సబ్‌డివిజన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. తెలంగాణ ఉద్యోగులను ఆంధ్ర ప్రాంత
సబ్‌డివిజన్‌కు బదిలీ చేయడం వలన వారు ఇబ్బందులుపడుతున్నారు.
    1) నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తడం చేసే 38 మందిని నర్సారావుపేట సబ్‌డివిజన్‌కు మార్చారు.
    2) సి అండ్‌ బి సెక్షన్‌లో పనిచేసే 18 మందిని ఆంధ్ర ప్రదేశ్‌కు మార్చారు.
    3) వాటర్‌ సప్లై మరియు సీవరేజ్‌ సబ్‌డివిజన్‌లో పని చేస్తున్న 29 మందిని అదేవిధంగా మార్చారు.
    పై  మూడు అంశాలలో తెలంగాణ స్థానికులను ఉద్దేశ్యపూర్వకంగా ఆంధ్ర ప్రదేశ్‌ సబ్‌డివిజన్‌కు మార్చడం సమర్థనీయం కాదు. వారి కుటుంబాలు, వారి పిల్లలు నాగార్జునసాగర్‌ ఎడమవైపు నివసిస్తున్నారు. ఇన్ని కుటుంబాలను ఇబ్బందిపెట్టడం సరికాదు. ప్రస్తుత స్థానికత ఆధారంగా మరియు వారు పని చేస్తున్న ప్రాంతం ఆధారంగా ప్రస్తుత సబ్‌డివిజన్‌లోనే కొనసాగించాలి.
    గతంలో ఇచ్చిన ప్రొసీడిరగ్స్‌ను రద్దు చేయుటకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

భవదీయులు....

                                  ---- తమ్మినేని వీరభద్రం
                                    

No comments:

Post a Comment