Tuesday, December 30, 2014

ప్రపంచ దేశాలపై క్రూడ్‌ ఆయిల్‌ ధరల ప్రభావం

  ఈ సంవత్సరంలో జూన్‌ మాసం నుండి ప్రపంచ క్రూడ్‌ ఆయిల్‌, ముడి పెట్రోలు, ధరలు తగ్గడం ప్రారంభమైంది. క్రూడ్‌ ఆయిల్‌ ఒక బ్యారెలు 115 డాలర్లు నుండి ప్రస్తుతం 60 డాలర్లకు పడి పోయింది. సగానికి సగం క్రూడ్‌ ఆయిల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గింది. బ్రెంట్‌ ధర, నైమక్స్‌ ధర అని రెండు చోట్ల క్రూడ్‌ ఆయిల్‌ ధరలు నిర్ధారించబడుతాయి. మొదటిది లండన్‌ నగరంలో రెండవది న్యూయార్క్‌ మెటల్‌ ఎక్సేంజ్‌ బేస్‌ ధర (మార్కెట్‌ ధర) నిర్ధారణ ప్రతి రోజు జరుగుతుంది.బ్రెంట్‌ ధర సూచిక ఆధారంగా ఒపెక్‌ దేశాలు ఎగుమతులు చేస్తాయి. ఒపెక్‌

మేధావులు మౌనం వహించడం కాదు - మేధోమథనం జరగాలి

గత కొంత కాలంగా రాష్ట్రంలో మేధావులు మౌనం దాల్చినట్టుగా కనిపిస్తున్నది. ఈ మౌనం కేవలం మేధావులకే పరిమితం కాకుండా ప్రజస్వామిక సంస్థలకు సంఘాలకు మౌనరాగం వర్తించేలా ఉంది. దశాబ్దకాలంపాటు ఉద్యమాల పునాదుల మీద ప్రజస్వామిక స్పూర్తిని చాటిన విసృత మేధోమథనాల చరిత్రను గత అరునెలల కాలంలో మేధావివర్గం మరిచినట్టు కన్పిస్తుంది. నూతనంగా పురుడు పోసుకున్న రాష్ట్రంలోనూ నిన్నటి మేధావుల

బీమా రంగానికి ''బీమార్‌'' చేస్తోందా?

బీమారంగం ప్రైవేటీకరణ అనంతరం, గడిచినదశాబ్దంన్నర కాలంలో భారత ప్రజలు విదేశీ ప్రైవేటు కంపెనీల తీరుతెన్నులను చాలా మేర తెలుసుకోగలిగారు. ఆ కారణం చేతనే వారు ప్రభుత్వ బీమా సంస్థలకు పట్టం కడుతున్నారు. ఆదరణచూపుతున్నారు. విశ్వసిస్తున్నారు. మరి అటువంటప్పుడు, నేడు మన ఎన్‌డిఎ పాలకులు ఆర్డినెన్స్‌ల ద్వారా విదేశీ బీమా కంపెనీలకు ఎర్ర తివాచీలు పరవడం ఎందుచేత?
             షేర్‌ మార్కెట్లకు సానుకూల సంకేతం ఇవ్వడం కావచ్చును..! లేదా అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థల మెప్పు కోసం కావచ్చును!! లేదా త్వరలో మనదేశ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు ఒబామాను సంతృప్తి పరిచేందుకు కూడా కావచ్చును!!!

విద్యుత్‌ సవరణ బిల్లుతో డిస్కంలకు ఉరి

 విద్యుత్‌రంగంలో ప్రపంచబ్యాంకు ఆదేశిత సంస్కరణల అమలును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేశాయి. వినియోగదారుల ప్రయోజనాలను ఎరగా వేసి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుకు దోచిపెట్టేందుకు అడ్డగోలు నిబంధనలతో రూపొందించిన డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ పథకానికి చట్ట రూపం ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం లోక్‌సభలో 2014 విద్యుత్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్రంలో గత యుపిఎ సర్కారు అమలు చేయాలనుకున్న విధానాలనే కేంద్రంలోని బిజెపి సర్కారు కొనసాగిస్తోందనడానికి ఇదో ఉదాహరణ. కేంద్రంలో అధికారాన్ని చెలాయించిన పార్టీలు వేరైనా వాటి విధానాలు ఒక్కటే. అప్పటి యుపిఎ సర్కారు అసంపూర్తిగా వదిలేసిన బిల్లుల్నే ఇప్పటి మోడీ ప్రభుత్వం చట్ట రూపంలోకి తెస్తోంది. దానిలో భాగమే డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణతో