Monday, November 3, 2014

బూర్జువా పార్టీలతో పొత్తుకు కారణం ఇదే.. : తమ్మినేని


                       హైదరాబాద్: కమ్యూనిస్టులు బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సమసమాజ స్థాపనకోసం తాము సాగిస్తున్న దీర్ఘకాలిక పోరాటం కొనసాగనే ఉంటామని, అదే సమయంలో తాత్కాలికంగానైనా ప్రజలకు మేలు చేసేందుకు, వారి సమస్యల పరిష్కారానికి కలిసి వచ్చే బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనేది
తమ విధానమని స్పష్టంగా వివరించారు. ఈ విధానం ద్వారా కొంతలో కొంతైనా ప్రజలకు న్యాయం జరుగుతందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ విధానాన్ని అనుసరించే క్రమంలోనూ జాగ్రత్త పాటిస్తామన్నారు. బూర్జువా పార్టీలన్నీ ప్రజలను పీడించేవే అయినప్పటికీ.. ఎవరి ద్వారానైతే తక్కువ నష్టం ప్రజలకు కలుగుతుందో వారి వెంట వెళ్లేందుకే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అందుకే అటు అవినీతి కాంగ్రెస్, ఇటు ప్రమాదకర మతోన్మాద బీజేపీలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో నిలబడ్డామని తమ విధానాన్ని విస్పష్టంగా వెల్లడించారు.

No comments:

Post a Comment