Monday, November 3, 2014

ప్రైవేటీకరణకు ఓకే అంటున్నారు.. ప్రజలకు ఉద్యోగాలిస్తామంటున్నారు.. ఎలా సాధ్యం..?: తమ్మినేని

                    హైదరాబాద్: ''దేశంలో కాంగ్రెస్, బిజెపి కావొచ్చు.. రాష్ట్రంలో టిడిపి ఇతర పార్టీలు కావొచ్చు.. ఇవన్నీ సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు పూర్తిగా మద్దతు పలుకుతున్నాయి. అదే సందర్భంలో ప్రజలకు ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నాయి. ఇది ఎలా సాధ్యమో అర్థం కావట్లేదు..'' అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. లోన సరళీకరణ విధానాలకు ఆమోదం తెలుపుతున్న ఈ పార్టీలు.. బయటకు వచ్చి మాత్రం నెరవేరని హామీలు ఇస్తూ ప్రజలను
మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఇప్పటి వరకూ పాలించిన కాంగ్రెస్ ఇవే విధానాలను అమలు చేసిందని, తాము దేశాన్ని బాగు చేస్తామని చెపుతున్న బీజేపీ కూడా ఇవే విధానాలను అనుసరించనుందని చెప్పారు. సంస్కరణలను వేగవంతం చేస్తానని మోడీ చెప్తున్నాడని.. దానర్థం.. సంక్షేమంలో కోత విధించడమేనని చెప్పారు. అయితే.. ప్రస్తుతం ప్రజలు సత్వర లాభాన్ని ఆశిస్తున్నారని, అందువల్లే ఈ పార్టీల ఆటలు సాగుతున్నాయని అన్నారు. కానీ.. ఈ పరిస్థితి ఎల్లకాలం ఉండదని, ఏ మాట వెనక ఏ అర్థం ఉందో.. ప్రజలు గమనించే రోజు త్వరలోనే వస్తుందని చెప్పారు.

No comments:

Post a Comment